CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల్లో మొక్కలు నాటితే అడ్డుకుంటాం - తుడుం దెబ్బ.

Share it:

 


మన్యం టీవీ మంగపేట. 

గత ఇరవై సంవత్సరాలనుండి సాగు చేసుకుంటున్న పోడు భూములలో అటవీ అధికారులు మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి ప్రయత్నం వెంటనే మానుకోవాలి అని తుడుం దెబ్బ నాయకులు కబ్బాక శ్రవణ్ కుమార్ డిమాండ్ చేసారు. 

మంగపేట మండలంలోని  కొత్తూరు,  మొట్లగూడెం, గ్రామ పంచాయతీ లోని  బొమ్మాయిగూడెం గ్రామంలో  ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు ఐటీడిఏ వారు సర్వే నిర్వహించడం జరిగింది. అట్టి భూములకు మ్యాపులు కూడా ఇచ్చినారు. తరువాత క్రమంలో  తెలంగాణా ఉద్యమసమయంలో ఈ ప్రక్రియ నిలిచి పోయింది. అట్టి భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అధికారులను కలవడం జరిగింది. ఇటీవలీ కాలంలో అటవీ అధికారులు సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు పెడతామని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.అటవీ అధికారుల వేధింపులు ఆపాలని , పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ ఐటీడీఏ  ఏపీఓ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు  వట్టం పుల్లయ్య, మంకిడి మహేందర్, కోరం అశోక్, ఈసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: