CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అటవీ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులను, పరిశీలించిన అటవీశాఖ ఉన్నతాధికారులు _

Share it:

  


కొత్తగూడెం డివిజన్,చండ్రుగొండ రెంజ్,పెంట్లం బీట్ అటవీ పరిధిలో అభివృద్ధి పనులు_                    మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కొత్తగూడెం ఫారెస్ట్ డివిజన్,చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్,పెంట్లం బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో,అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్య ప్రాణుల సంరక్షణలో భాగంగా వేసవికాలంలో అటవీ జంతువులు,నీటి ఎద్దడికి గురికాకుండా,భూగర్భ జలాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన నీటి కుంటలు(పిటీ),అంతరించిపోతున్న అడవిని పునరుద్ధరణ చేయుటకు (ప్లాంటేషన్)మొక్కల పెంపకం,పచ్చిక మైదానాలు(గ్రాస్ ప్లాంట్స్)పనులను అటవీశాఖ ఉన్నతాధికారులైన తెలంగాణ రాష్ట్ర పి.సి.సీ.ఎఫ్(సి.ఎ.ఎమ్.పిఎ)-లోకేష్ జస్వాల్,భద్రాద్రి సర్కిల్ సి.సీ.ఎఫ్-పివీ.రాజారావు,భద్రాద్రి కొత్తగూడెం డి.ఎఫ్.ఓ-లక్ష్మణ్ రంజిత్ నాయక్, కొత్తగూడెం డివిజన్ ఎఫ్.డి.ఓ-ఎ.అప్పయ్య, ఐ.ఎఫ్.ఎస్(పి)-ప్రశాంత్ పాటిల్ పరిశీలించారు.లోకేష్ జస్వాల్ మాట్లాడుతూ ఫారెస్ట్ బ్లాక్ ఎంతమేరకు ఉన్నది,ఆ ఏరియా నందు ఏమేమి పనులు చేశారు,మిగిలిన ఏరియాలో ఏమి పనులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.ఇక మీదట అటవీ భూమి అంగుళం కూడా అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అదే విధంగా అటవీ భూమిలో చేపట్టిన నీటి కుంటల ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించారు.ప్రతి నీటి కుంట వద్ద అటవీ జంతువుల కొరకు పచ్చిక మైదానాలు అభివృద్ధి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ సిహెచ్.శ్రీనివాసరావు మరియు సెక్షన్ అధికారి నాగరాజు,బీట్ అధికారి బి.చందర్,తదితర అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: