మన్యం టీవి, పినపాక:మండల పరిధిలోని మల్లారం మూలమలుపు వద్ద ఆగివున్న ట్రాక్టర్ ని బైకు ఢీకొని యువకుదు దుర్మరణం చెందిన సంఘటన ఈ రోజు సాయంత్రం చోటు చేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పినపాక మండలం ఏడుల్లా బయ్యారం గ్రామానికి చెందిన నూకల సుబ్బారావు(23)తన స్వంత పని పై ఈ.బయ్యరంగ్రామం నుండి టి.కొత్త గూడెం వెళుతున్న క్రమంలో మణుగూరు ఏటూరి నాగరం ప్రధాన రహదారి,మల్లారం మూలమలుపు వద్ద ఆగివున్న ఇటుక ట్రాక్టర్ ట్రాలీ ని తన ద్విచక్ర వాహనం తో వెనుక భాగంలో ఢీ కొట్టడం తో తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు నూకలపెద్ద సుబ్బారావు,కుమారి ల ఏకైక కుమారుడు.స ఏడుల్లా బయ్యరం సీఐ దోమల రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏడూళ్ళ బయ్యరం పోలీసులు కేసు నమోదు చేశారు.
*మృతుడు చిన్న సుబ్బారావు తలకు హెల్మెట్ ధరించినప్పటికిని తన ప్రాణం కపాడలేకుండా పోయింది.ఒక్కగానొక్క కొడుకును ట్రాక్టర్ బలి తీసుకోవడం తో మృతుని తల్లిదండ్రులు రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది.
Post A Comment: