CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దివ్యాంగ వివాహ ఆదర్శ పరిచయ వేదిక ఒక కరపత్రాన్ని ఆవిష్కరించిన చండ్రుగొండ ఎస్ ఐ బి. రాజేష్ కుమార్

Share it:


చండ్రుగొండ మన్యం టీవీ : వివాహాలు ఆడంబరాలు, ఆర్భాటాలు కాదని ఆదర్శంగా ఉండాలనే ఆకాంక్షతో ఈనెల 20వ తేదీన కొత్తగూడెం పట్టణం అంబేద్కర్ భవన్లో తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం(టి వి పి ఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దివ్యాంగుల వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని బుధవారం చండ్రుగొండ ఎస్.ఐ బి. రాజేష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అయినా వారు వివాహాలు చేసుకుని కుటుంబంతో చాలా సంతోషంగా జీవించాలని, చాలా మంది దివ్యాంగులు విద్య, ఉద్యోగ, ఉపాధి, సొంత వ్యాపారాలు, చేసుకుంటూ సమాజంలో గౌరవంగా ఉన్నప్పటికీ వివాహలు చేసుకోవడానికి సంకోచిస్తూ ఒంటరితనంతో బాధపడుతున్నారని వారు కూడా వివాహాలు చేసుకుని కొత్త జీవితాన్ని  ఆరంబించాలని అన్నారు. అలాగే దివ్యాంగులను వివాహం చేసుకుంటే వారి సంతానం కూడా దివ్యాo గులుగా పుడతారనే అపోహలు పోవాలిని అన్నారు. వివాహంకని దివ్యాంగుల కోసం టి వి పి ఎస్ ఈ కార్యక్రమం జరపటo మంచి విషయం అని అన్నారు. దివ్యాంగులు సమాజంలో అన్ని వర్గాలతో పాటు సమానంగా రాణిస్తున్నారని, వారి శరీరానికి  అంగవైకల్యం ఉండవచ్చుగానీ, వారికి మానసిక స్థైర్యం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వివాహంమంటే ఆడంబరాలు, ఆర్బాటాలు కాదని ఆదర్శంగా ఉండాలని, దివ్యాంగుల పై సానుభూతి చూపితే వారి జీవితం మారాదని, సహకారంతోనే వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చు అన్నారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గుండపునేని మాట్లాడుతూ వివాహ రిజిస్ట్రేషన్ కోసం  (9248335561) సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంపెన సొసైటీ వైస్ చైర్మన్  నల్లమోతుల వెంకటనారాయణ,  మండల అధ్యక్షులు కాసీం, సభ్యులు గోపాల్, గణపతి, లక్ష్మయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: