మన్యం టీవీ : జూలూరుపాడు,
మండలంలోని ఎల్లంకి గార్డెన్ లో బుధవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోని, జడ్పీటీసీ భూక్య కళావతి, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకట్ రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి నున్నా రంగారావు, సొసైటీ డైరెక్టర్ కొమ్మినేని పాండు, ఎంపీటీసీలు దుద్దుకూరు మధుసూదన్ రావు, పెండ్యాల రాజశేఖర్, పి నర్సాపురం సర్పంచ్ కట్రం మోహన్ రావు ,టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: