మన్యం టీవీ : భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, తొట్టి గుంపు గ్రామ ఆదివాసుల భూమి సమస్యలు పరిష్కరించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత 35 రోజుల నుండి చేస్తున్నా దీక్షలను ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం బృందం ఆదివారం సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు జగ్గా పుల్లయ్య, మాట్లాడుతూ.. తరతరాల నుండి తొట్టి గుంపు గ్రామ ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు,.. కోర్టు తీర్పులకు,.. ఆదివాసీ చట్టాలకు,.. వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులు గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వటాన్ని పూర్తిగా ఖండిస్తున్నా మన్నారు. ఆదివాసి చట్టాలను అమలు చేయవలసిన అధికారులు ఆదివాసీల కు వ్యతిరేకంగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. చట్ట వ్యతిరేకంగా గిరిజనేతరులకు పట్టాలు మంజూరు చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జరిగే పోడు పోరాటాలకు ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిటిక నర్సింహారావు, పల్లె శ్రీనివాస్, భూరం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: