మన్యం టీవీ, ములకలపల్లి:
మండల కేంద్రము లో మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన టిఆర్ఎస్ కార్యకర్త బోడా సాంబ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన బోడా సాంబ కుటుంబానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ,తెలంగాణ ఉద్యమ నాయకుడు ముబారక్ బాబా,తాళ్లపాయి సర్పంచ్ బైటి రాజేష్,ఎంపీటీసీ శనగ పాటి సీతారాములు,బండి కొమరయ్య , పుప్పాల చందర్ రావు, కొండల రావు, అనీల్, కాటంరాజు, సంతోష్, పాల్గొనడం జరిగింది.
Post A Comment: