మన్యం టీవీ, అశ్వాపురం:2021 నూతన సంవత్సరం సందర్భంగా జరిగే వేడుకలను విషాదంగా మారకుండా తమ ఇంటి వద్దనే ప్రశాంతమైన వాతవారణంలో జరుపుకోవాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశం మొత్తం కరోనా మహామ్మరి వైరస్ తో పోరాడుతుంది.కావున ప్రజలందరూ కూడా రోడ్ల పైకి వచ్చి సంబరాలు జరుపుకొవొద్ధు.బయట ఎవరూ కూడా గుంపులు గుంపులుగా తిరగవద్దు.
నిబంధనలు అతిక్రమించి డీజేలు వినియోగిస్తే సీజు చేస్తాం.
మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడ్డ వారి పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తాం.బండ్లను సీజ్ చేసి కోర్టు కి అప్పగించడం జరుగుతుంది.
నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి సంవత్సరం మద్యం మత్తులో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు సైతం హాని కల్పించే విధంగా ర్యాష్ డ్రైవీంగ్ చేస్తున్నారు.
-మద్యం సేవించి రొడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా మరల రోడ్డు ప్రమాదాలలో ఎవరూ ప్రాణాలను కొల్పో కండి.మీ కుటుంబాలలో అంధకారాన్ని నింపకండి.
ఆ రోజు అన్ని ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలీంగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తాం అని అశ్వాపురం సీఐ సట్ల రాజు తెలిపారు.
Post A Comment: