మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం,శెట్టిపల్లి గ్రామపంచాయతీ లోని లింగాపురం కు చెందిన వికలాంగులు ఈసం బాలక్రిష్ణ,కుంజ సుజాత బుధవారం మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసారు. ఈ సందర్భంగా వారు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే రేగా కాంతారావు కు వివరించారు.విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ కుంజా సుజాతకు ట్రై సైకిల్ ను ఇస్తామన్నారు.అలాగే ఈసం బాలక్రిష్ణ సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని కోరగా ప్లాస్టిక్ కాలు మరియు సర్టిఫికెట్ ఇపించేలా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.సాయం అంటే నేను ఉన్నాను అంటూ వెంటనే స్పందిస్తూ, ప్రజల సమస్యలను తీరుస్తూ,సవాళ్లును సమర్ధవంతంగా ఎదుర్కొంటు రేగా మార్కు పరిపాలన ను అందిస్తున్న ప్రజా నాయకులు,మన్యం ముద్దుబిడ్డ,విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కుంజ. సుజాత,ఈసం బాలక్రిష్ణ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: