గుండాల మన్యం టీవీ: ఏజెన్సీ గ్రామాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చతిస్గడ్ ప్రాంతం నుంచి మావోయిస్టు నక్సలైట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లోకి వచ్చారని పక్కా సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. చతిస్గడ్ ప్రాంతం నుంచి వలస వచ్చి ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో వివిధ గ్రామాల్లో స్థిరపడిన గొత్తి కోయ గ్రామాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. చత్తీస్గడ్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న మావోయిస్టు నక్సలైట్ల పోస్టర్లను గుండాల ఎస్ఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో గోడలకు అంటించారు. మావోయిస్టు పార్టీకి చెందిన బడే చొక్కా రావు, కురసం మంగు, పాండు మంగులు, కొవ్వాసి గంగా,మంగు, బూరా రాకేష్, యాలం నరేందర్ ఏజెన్సీలో సంచరిస్తున్నారని, అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ.. నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు.
Navigation
Post A Comment: