CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల ఆక్రమణ నిలిపివేయాలి. - ఆవునూరి మధు

Share it:


గత నలభై సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో  ఆదివాసీలు సాగు చేసుకున్న పోడు ఆక్రమించుకునే కుట్రలకు వ్యతిరేకంగా గిరిజనులు, గిరిజనేతరులు ఐక్యంగా పోరాడాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు  ఆవునూరి మధు పిలుపునిచ్చారు.  బుధవారం గుండాల మండలం శేoబుని గూడెం గ్రామంలో జరిగిన పోడు భూముల సదస్సులో  మాట్లాడుతూ 2006 చట్టం ప్రకారం ఆదివాసులు సాగు  చేసుకున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. పోడు భూములో  పండించిన మొక్కజొన్న పంటను ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని, వరి సన్న ధాన్యానికి ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించాలన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా  గ్రామాల్లో  సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం( పీ వై ఎల్) రాష్ట్ర నాయకులు పరిశిక రవి,  న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు అరెo నరేష్,  మండల  నాయకులు బచ్చల సారన్న,  కల్తీ మల్లన్న,  మల్యాల మల్లేష్,  చెట్టు పల్లి ఉపసర్పంచ్ జనగం వాసు,  వట్టం వెంకన్న,  మోకాళ్ల బుచ్చయ్య,  ఈసం శేషయ్య,  ఈసం ఆదినారాయణ,  బండారు రాజు,  పొడుగు జార్జి,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: