మన్యం టీవి,పినపాక:
పినపాక మణుగూరు మండలాల మధ్యలో నిర్మించిన బి టి పి ఎస్ లో భూనిర్వాసితులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తుడుందెబ్బ మండల అధ్యక్షులు కొమరం శ్రీను డిమాండ్ చేశారు. బుధవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో జిల్లా కార్యదర్శి గోగ్గల రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ నిర్వాసితుల ను తాత్కాలిక ఉద్యోగులు గా నియమించి చాలీచాలని జీతాలు ఇస్తూ వెట్టిచాకిరీ చేయిస్తున్నారు అని ఆరోపించారు. స్థానిక యువత కు, గిరిజనులకు ఏజెన్సీ నియమానుసారం ఉద్యోగాలు కల్పిస్తామని గ్రామ సభల్లో ప్రాజెక్ట్ ఆఫీసర్, కలెక్టర్ సైతం ఎన్నోసార్లు చెప్పారన్నారు. ప్రస్తుతం వాటిని తుంగలో తొక్కి స్థానిక యువతను వెట్టిచాకిరి కి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. భూ నిర్వాసితులు తరఫున పోరాటాలు చేయడానికి తుడుందెబ్బ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వరూపరాణి, సారయ్య, సర్వేష్, సాంబశివరావు, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: