వాలీబాల్ క్రీడాలను ప్రారంబించిన మణుగూరు ఏఎస్పీ డా,,శబరిష్. మన్యం టీవీ:కరకగూడెం .కరకగూడెం పోలిస్ స్టెషన్ అవర్ణలోని శనివారం మణుగూరు ఏఎస్పీ డా,, శబరిష్ మండల స్థాయి వాలీబాల్ క్రీడాలను ప్రాంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న యువకులు అందరూ కూడా క్రీడల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని, దృఢత్వాన్ని పెంపొందించుకొవాలని కోరారు.ఇలాంటి క్రీడా కార్యక్రమల ద్వారా పోలీస్ లకి, మరియు ప్రజలు మధ్య స్నేహ పూర్వక సంబంధము ఏర్పడుతుంది అని తెలిపారు. ప్రజలు అన్ని వేళల్లో పోలీసులకి సహకారాన్ని అందించాలని కోరారు. ప్రతి పౌరుడు కూడా యూనిఫాం లేని పోలీస్ లే అని సందేశముని ఇచ్చారు.ఈ క్రీడా పోటీలో 45 గ్రామాల్లో ని యువకులు మరియు వలస ఆదివాసీ గ్రామాల యువకులు కూడా పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎడుళ్లా బయ్యారం సి ఐ డి.రమేష్ సార్,కరకగూడెం ఎసై.జి. ప్రవీణ్ కుమార్, ఏడుళ్లా బయ్యారం ఎసై టి వి వెంకట సూరి, కరకగూడెం అర్ ఎసై జె. సురేందర్ మరియు పోలీస్ సిబ్బంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: