మన్యం టీవీ చర్ల : ఈరోజు బి ఆర్ అంబేద్కర్ 64 వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట నిర్మాణ కమిటీ అధ్యక్షులు తడికల లాలయ్య, కార్యదర్శి మచ్చ రామారావు, కళారవళి చైర్మన్ నీలి నందుబాబు, లయన్స్ అధ్యక్షులు నీలి ప్రకాష్,తన్నీరు శ్రీను అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అధ్యక్షులు తడికల లాలయ్య మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణకర్తగా నిమ్న జాతులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందని రిజర్వేషన్లను అందుబాటులోకి వచ్చే విధంగా చేసిన మహానీయుడని కొనియాడారు. అందరూ విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని, భారతదేశాన్ని- రాజ్యాంగాన్ని గౌరవించి ఉన్నత స్థితిలో ఉండాలని అన్నారు.
Post A Comment: