మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మణుగూరు మరియు అశ్వాపురం లోని భవన నిర్మాణ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను జడ్పీటీసీ పొశం నర్సింహారావు అందజేశారు. ఈ సందర్భంగా లేబర్ ఇన్సూరెన్స్ ఆఫీసర్ కుటుంబరావు మాట్లాడుతూ లేబర్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను కార్మికులకు వివరించారు.అనంతరం జడ్పీటీసీ పొశం నర్సింహారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక లేబర్ ఇన్సూరెన్స్ ప్రయోజనాల ను,లాభాలను పెంచారు అని ప్రతి ఒక్కరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కలిగి ఉండాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, పిఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, లేబర్ ఇన్సూరెన్స్ ఆఫీసర్, కుటుంబరావు,సీతారాములు,రైతు బంధు అధ్యక్షులు వెంకటప్పయా, టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,రామయ్య,లారీ లోడింగ్ మరియు అన్ లోడింగ్ కార్మికుల సంఘం, మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Post A Comment: