మన్యం టీవీ, అశ్వాపురం:రేపు మంగళవారం నాడు రైతులు తలపెట్టిన భారత బంద్ కు తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించినందున రాష్ట్ర టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గ్రామ బూత్ అధ్యక్షులు మరియు ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలి అని అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ కోరారు.
కావున అశ్వాపురం మండల వ్యాపారస్తులు, హోటల్ యజమానులు, బ్యాంకులు, వివిధ వాణిజ్య సముదాయాల యజమానులు, తమ షాప్ లు స్వచ్ఛందంగా బంద్ చేసి బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ కోరారు.
Post A Comment: