రేపటి భారత్ బంద్ విజయవంతం చెయ్యండి
*రైతులకు మద్దతు గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బంద్ లో పాల్గొనాలి.
*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
మన్యంటీవీ ఏటూరునాగారం:
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా(రేపు) మంగళవారంరోజున జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని, ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్నమహత్తరమైన పోరాటానికి మద్దతుగా కాం గ్రేస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలు రైతులకు మద్దతుగా నిలిచి మంగళవారం రోజు జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
Post A Comment: