మన్యం టీవీ మణుగూరు:-
భారతదేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కార్మిక వర్గం అండగా నిలబడదాం అని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బండిరాజేష్ పిలుపునిచ్చారు.సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సికెఎస్-సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లే- కార్డులు, నల్ల రిబ్బన్ తో నిరసన కార్యక్రమం చేశారు. అనంతరం బండిరాజేష్ మాట్లాడుతూ,రైతులు,ప్రజలపై భారాలు మోపి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని,దేశంలో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 500 పైగా రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న పోరాటానికి, ఆందోళనకు మద్దతు ఇవ్వాలని రైతులని ఢిల్లీ కి రాకుండా అడ్డుకునెందుకు బీజేపీ ప్రభుత్వం రైతాంగం పై దాడులను,నిర్బాంధాన్ని ఖండించాలని సీఐటీయూ కార్మిక వర్గానికి పిలుపునిస్తుందన్నారు.నేడు రైతులు చేస్తున్న పోరాటం, ఆందోళనలు రైతుల కోసం మాత్రమే కాదని భారతదేశ 139 కోట్ల మంది ప్రజల ఆహార భద్రత కోసం జరుగుతున్న పోరాటం అన్నారు.నూతన వ్యవసాయ చట్టాలు మూలంగా వ్యవసాయ రంగం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ దెబ్బతింటుందని ప్రజల ఆహార భద్రత పై ప్రభావం పడుతుందని రైతులకు గిట్టుబాటు ధరలు లేక దివాళా తీస్తారని మరోపక్క నిత్యావసర ధరలు కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం పెరిగి ప్రజలపై, వినియోగదారుల పై భారాలు పెరుగుతాయని అందుకే వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతాంగం ఆందోళనలు చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలు చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బీజేపీ ప్రభుత్వం రైతుల పై జల ఫిరంగులు,బాష్పవాయువును, లాఠీచార్జి ప్రయోగిస్తూ యుద్ధం చేయడం దారుణం అన్నారు.రైతాంగం ఢిల్లీకి రాకుండా అడ్డుకునెందుకు ఢిల్లీ బోర్డర్ లో శత్రుదేశాల సైనికులను నిర్బంధించిన విధంగా ముళ్ళ కంచెలు , అడ్డుగోడలు నిర్మిస్తున్నారు, కాని రైతులు నూతన వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే దాక తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పొరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టాలు రద్దు చేయకపోతే భారత కార్మిక వర్గం కూడా ప్రత్యేక పోరాటాలు లోకి చేస్తామన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో తులసి కృష్ణయ్య ,బింగి మాధవరావు,రవి,బండ్ల ముత్తారావు,ఆనంద్ , బాలకృష్ణ , పూర్ణచంద్రరావు, నిరంజన్ , సత్యనారాయణ, నాగయ్య,మీరాహుసేన్,భద్రయ్య,నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: