మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో కేవా ఇండస్ట్రీస్ డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేవా ఇండస్ట్రీస్ కంపెనీ డైరెక్టర్ లలో ఒకరైన చెట్టిపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో కేవా ఇండస్ట్రీస్ డైరెక్టర్ చెట్టిపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులు, వాతావరణకాలుష్యం, వ్యక్తుల అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని కేవా ఇండస్ట్రీస్ ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేసారని ఇవి పూర్తిగా ఆయుర్వేద ఫుడ్ సప్లిమెంట్స్ అని వాటి యొక్క పనితనం, దీర్ఘకాలిక రోగాలకు సైతం చాలా చక్కగా పనిచేస్తాయని వివరించారు. మనం తినే ఆహరం, పీల్చే గాలి, తాగేనీరు అన్ని కాలుష్యంతో నిండి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి వీటికి సరైన ఔషధం ఆయుర్వేదమేనని అటువంటి ఆయుర్వేద ఔషదాలు ప్రజలు వాడి తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఈ సందర్బంగా సూచించారు. కేవ ఇండస్ట్రీస్ కంపెనీ ఆధ్వర్యంలో ఫుడ్ సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయని, అంతేకాకుండా మా కంపెనీలో బాడీ అనలైజర్ మిషన్ సహాయంతో వ్యక్తి బాడీ అనలైజ్ చేసి వారిలో ఉన్న లోపాలను తెలుసుకోవడం జరుగుతుంది తద్వారా వారికీ తగు ఫుడ్ సప్లిమెంట్స్ సూచించడం జరుగుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాజరైన డిస్ట్రిబ్యూటర్ల కు ఐడికార్డులు, లీగల్ సర్టిఫికెట్ ఫైల్స్ అందజేయటం జరిగింది. ఈ సమావేశంలో కంపెనీ డైరెక్టర్స్ చెట్టిపల్లి వెంకటేశ్వర్లు, జాజా రవి, సీనియర్ మేనేజర్ పులి సతీష్, జి ఉపేందర్, మరియు డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.
Post A Comment: