మన్యంటీవీ ఏటూరునాగారం: మండలంలోనికొండాయి కొత్తూరు గ్రామంలో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్ సి ఆర్ పి ఎఫ్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా గుంపులోని ప్రతి ఒక్క ఇంటిలోని వ్యక్తులను వారి యొక్క ఆధార్ కార్డులను చెక్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులలోనూ కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని మరియు సంఘవిద్రోహ శక్తుల కు ఆశ్రయం కల్పించి కూడదని,సహకరించవద్దని మరియు ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: