CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వికలాంగుల ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాల ద్వారా కూడా తీసుకునే వెసులుబాటు ప్రక్రియను పూర్తి చేయాలి

Share it:


మన్యంటీవీ ఏటూరునాగారం:

                                     


వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంబంధిత జిల్లా వికలాంగుల  సంక్షేమ అధికారిని  ప్రేమ లత మేడం గారిని కలవడం జరిగింది .ఇతర  జిల్లాలలో మాదిరిగానే వికలాంగుల ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాల ద్వారా కూడా అందించాలని  కోరుతూ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఓరుగంటి కుమారస్వామి మాట్లాడుతూ  ప్రస్తుతం వికలాంగుల ఆసరా పింఛన్లు పోస్టాఫీసు ద్వారా ఇవ్వడం జరుగుతుందని దీనివల్ల వికలాంగులు గంటల తరబడి నిలుచుంటూ , రోజుల తరబడి పోస్ట్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు .గతంలో  ములుగు జిల్లాలోని ఎంపిడిఓ  ఆఫీస్ అధికారులు వికలాంగుల పింఛన్లు పోస్ట్ ఆఫీస్ నుండి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయుటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను తీసుకోవడం జరిగినది. కానీ ఆ ప్రక్రియను ఇప్పటివరకు పూర్తి చేయలేదు వికలాంగులు ఇబ్బంది పడకుండా వారి పింఛన్లు పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకుల ద్వారా కూడా తీసుకునే విధంగా  వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని గూర్చి సంబంధిత వికలాంగుల జిల్లా సంక్షేమ  అధికారిని ప్రేమ లత మేడం గారు స్పందిస్తూ జిల్లాలోని 9 మండలాల ఎం పి డి ఓ అధికారులతో మాట్లాడతానని, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ములుగు మండల అధ్యక్షుడు ఫరూక్ అలీ ,  కనకం రాజు, స్వాతి, హైమ, లక్ష్మణ్, సాంబిరెడ్డి,  గౌస్ పాషా,సకావత్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: