మన్యం టీవీ వాజేడు. వాజేడు మండలం లోని గుమ్మడి దొడ్డి గ్రామంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షులు ఎట్టి రాజబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు గారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసి భూములను ఫారెస్ట్ అధికారులు మా భూములు అని లాక్కోవడం వేధించడం కేసులు పెట్టడం చూసి చలించిన గౌరవ ప్రభుత్వ విప్ ని ఫారెస్ట్ అధికారులు విమర్శలు చేయడం తక్షణమే మానుకోవాలి లేకుంటే ఆదివాసి ప్రజల చేతుల్లో అధికారుల పరాభవం తప్పదు అన్నారు జిల్లా ఉపాధ్యక్షులు జానకి రావు గారు మాట్లాడుతూ గౌరవ విప్ స్వయానా ఆదివాసి కావడం వలన తనకి పోడు భూముల సమస్యలు తెలుసు దానిపై స్పందిస్తే దానిని రాజకీయం చేయడం బాధాకరమన్నారు ఇప్పటికైనా రేగా కాంతారావు గారి పై విమర్శలు చేస్తే ఆదివాసీ సంఘాలుగా చూస్తూ ఊరుకోం అన్నారు విమర్శలు చేసిన అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి రమేష్. సిద్దబోయిన సర్వేశ్వరరావు .ఎట్టి సాయిరాం . కంబాలపల్లి హరినాథ్. జెజ్జారి తరుణ్ కుమార్. పాయం సాయి తేజ. జెజ్జారి అశోక్ . కంబాలపల్లి వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: