మన్యంటివి,అశ్వారావుపేట: పోడు పోరులో విప్ రేగా కి తాటి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఏజెన్సీగిరిజన ప్రాంతంలో గిరిజనులు పోడు కొట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారని,వారిని ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. గిరిజనులు అమాయకత్వం లో పోడు కొట్టిన భూములు కోల్పోయారని ,ఇప్పటికీ పోడు పట్టాలు ఉన్న ఫారెస్ట్ వాళ్ళు ఆ పట్టాలు చెల్లవని భూముల్ని లాగేసుకోవడం దారుణం అన్నారు. దీని పరిష్కారం కోసం రేగా కాంతారావు ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉన్నామని ఇప్పటికైనా గిరిజనుల మీద దయ చూపాలి అని ఫారెస్ట్, రెవిన్యూ అధికారులు భూస్వాముల పక్షాన మాట్లాడకుండా, పోడు భూమి చేసుకునే పేద గిరిజనులకు హక్కు పత్రాలను కల్పించాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు.
Post A Comment: