CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవులను నరకడం తోనే వన్య మృగాలు గ్రామాల బాట

Share it:


 అడవులను నరకడం తోనే వన్య మృగాలు గ్రామాల బాట

*అడవులను నరికితే కఠిన చర్యలు

  *ఏడుళ్ళ బయ్యరం రేంజ్  అటవీ పరిధిలో అభివృద్ధి పనులు పరిశీలించి  పిసిసీఎఫ్(సి.ఎ.ఎమ్.పిఎ)-లోకేష్ జస్వాల్              

మన్యంటీవి,పినపాక: అడవులను నరకడం తోనే వన్య మృగాలు గ్రామాల బాట పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర పి.సి.సీ.ఎఫ్(సి.ఎ.ఎమ్.పిఎ)-లోకేష్ జస్వాల్ అన్నారు.ఆయన కాంపా నిధులతో ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుల్ల బయ్యారం రేంజ్ ఎల్చి రెడ్డిపల్లి బ్లాక్ లో42 హెక్టార్లలో  ఏర్పాటు చెసిన మారుజాతి ప్లాంటేషన్ ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు.  వన్య ప్రాణుల సంరక్షణలో భాగంగా వేసవికాలంలో అటవీ జంతువులు,నీటి ఎద్దడికి గురికాకుండా,భూగర్భ జలాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన నీటి కుంటలు,అంతరించిపోతున్న అడవిని పునరుద్ధరణ చేయుటకు మొక్కల పెంపకం,పచ్చిక మైదానాలు పనులను అటవీశాఖ ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్ర పి.సి.సీ.ఎఫ్(సి.ఎ.ఎమ్.పిఎ)-లోకేష్ జస్వాల్,భద్రాద్రి సర్కిల్ సి.సీ.ఎఫ్-పివీ.రాజారావు,భద్రాద్రి కొత్తగూడెం డి.ఎఫ్.ఓ-లక్ష్మణ్ రంజిత్ నాయక్, కొత్తగూడెం డివిజన్ ఎఫ్.డి.ఓ-ఎ.అప్పయ్య, ఐ.ఎఫ్.ఎస్(పి)-ప్రశాంత్ పాటిల్ పరిశీలించారు. ఫారెస్ట్ బ్లాక్ ఎంతమేరకు ఉన్నది,ఆ ఏరియా నందు ఏమేమి పనులు చేశారు,మిగిలిన ఏరియాలో ఏమి పనులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.ఇక మీదట అటవీ భూమి అంగుళం కూడా అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అదే విధంగా అటవీ భూమిలో చేపట్టిన నీటి కుంటల ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించారు.ప్రతి నీటి కుంట వద్ద అటవీ జంతువుల కొరకు పచ్చిక మైదానాలు అభివృద్ధి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏడుల్లా బయ్యారం ఫారెస్ట్ రేంజర్ బి.వెంకటేశ్వర్లు, కే.తేజస్వవి(ట్రెని ఎఫ్ఆర్వో), అటవీ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: