ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం పురస్కరించుకుని డా,,పర్షియా నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డా,,పర్షియా నాయక్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఆరోగ్యమే మహా భాగ్యమని,బలవర్థకమైన ఆహారం తినడంతో పాటు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రమ్మ,సునీల్,శ్రీను,సత్యనారాయణ,ఎఎన్ఎంలు,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: