మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం సారపాక ముత్యంపేటలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పరశురామ్ పరివర్ వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సహకారంతో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ శర్మ గారు కార్తీక మాసం,కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి శివనామస్మరణ చేసుకున్నారు.
Post A Comment: