CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

Share it:


మన్యం టీవి, హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ్యులు  నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల సీఎం  కేసీఆర్  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జీవితాంతంప్రజల కోసం పని చేసిన నాయకుడిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విప్ రేగా ప్రగాఢ సంతాపం

నాగార్జునసాగర్ శాసనసభ్యులు  నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.30 సంవత్సరాల నోముల రాజకీయ, ప్రజా జీవితంలో మొదటసారిగా 1987లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ కేంద్ర మండలం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారని, అనంతరం 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మార్క్సిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై గొంతు ఎత్తారన్నారు. ప్రజల గొంతుక నోముల మృతు ప్రజలకు, టీఆరెస్ పార్టీ కి తీరని లోటు అని,నోముల కుటుంబానికి రేగా కాంతారావు సానుభూతి తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: