మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలంలో ప్రింట్ మీడియా జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని అశ్వాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కు వినతి పత్రం అందజేశారు. ఎన్నొ ఏండ్లుగా ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ప్రత్యేక చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని జర్నలిస్టు లు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే వెంటనే తహసిల్దార్ తో మాట్లాడి అశ్వాపురం లో జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాల సమస్య పరిష్క రించాల నీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేందర్ రెడ్డి, కొడారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు కమటం వెంకన్న, కోశాధికారి కొండా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ రెడ్డి మహేష్ కుమార్, సభ్యులు శ్రీధర్ రెడ్డి, నరేష్, కిశోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: