CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోర్టు తీర్పులను ఉల్లంఘించి గిరిజనేతరులకు చట్టవిరుద్ధంగా పట్టాలు మంజూరు చేయగా, బాధిత గిరిజనులు ఐటీడీఏ భద్రాచలం వద్ద నిరసన

Share it:


మన్యంటివి, భద్రాచలం:-  దమ్మపేట రెవిన్యూ అధికారులు చట్టవిరుద్ధంగా గిరిజనేతరులకు జారీ చేసిన పట్టాలను రద్దు చేయాలని కోరుతూ తొట్టిపంపు ఆదివాసి రైతులు భద్రాచలం ఐటీడీఏ ఎదురుగా రిలే నిరాహార దీక్ష 29వ రోజుకు చేరుకుంది.  గతంలో తొట్టిపంపు నుండి 25-09-2020  దమ్మపేట రెవిన్యూ కార్యాలయం వరకు పాదయాత్ర చేయడం జరిగిందని తెలిపారు.  అక్రమ పట్టాలను జారీ చేసిన రెవిన్యూ అధికారులు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు ర్యాలీలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ ఎదుట కూడా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న అధికారుల్లో స్పందన లేదని తెలిపారు. ఈ పట్టాలు ఎలా మంజూరు చేశారు సంబంధించిన రికార్డులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాము అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య, కేసరి రాంబాబు, పాయం సత్యనారాయణ, కల్లూరి కిషోర్, ముర్రం వీరభద్రం, వర్ష ముద్రాజ్, తెల్లం రామకృష్ణ, పొట్ట ఇరిఅప్ప, సున్నం రాజులు, కారం కృష్ణయ్య, దార బోయిన పోతురాజు, పొట్ట దశరథ్, బండారు పుల్లారావు, సున్నం నవీన్ మరియు కారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: