వెంకటాపురం(నూగూరు)
ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) బాలసాని ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలసాని కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు ఉచితంగా రెండు హార్ట్ వాటర్, కూల్ వాటర్ ఫ్రిజ్ లను బుధువారం పంపిణీచేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు బాలసాని ఇందిర, వేణు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాలసాని అశ్వాపతి, జడ్పీటీసీ పాయం రమణ, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఛిడెం యామిలి, తెరాస మండల అధ్యక్ష, కార్యదర్శులు గంపారాంబాబు, పిల్లరశెట్టి మురళి, అధికారప్రతినిది దార్రా దామోదర్, ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్, నాయకులు అచ్చానాగేశ్వరావు, బాలసాని శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: