CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రిజిస్ట్రేషన్ లేని సంఘానికి ఇసుక క్వారీ తీర్మానం రద్దు చేయాలి

Share it:


మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలం  ఏజెన్సీ ప్రాంతం షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతం అయిన వాడగూడెం గ్రామం, రెవిన్యూ గ్రామం, అయినవాడగూడెం జీపీ పరిధిలోని గోదావరి ఇసుక క్వారీ గ్రామ సభ 27/11/2020 న తీర్మానం రిజిస్ట్రేషన్ లేని సంఘానికి చేసిన తీర్మానం రద్దు చేసి, రిజిస్ట్రేషన్ ఉన్న సంఘానికి అనుమతి ఇవ్వవలసినదిగా కోరుతూ ఏటూరునాగారం ఐటిడిఏ పీఓ కు పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క ఎస్టీ ఇసుక క్వారీ సంఘం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా గిరిజనయువత, నాయకులు మాట్లాడుతూ కోనేరు రంగారావు భూముల కమిషన్ ఆధారంగా ఇసుకవ్యాపారం చేసే హక్కు గిరిజనులకు ఉన్నది కానీ 1964 చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ఉన్న సంఘాలకు మాత్రమే ఆ అర్హత ఉన్నది, 1995 మాక్స్ రిజిస్ట్రేషన్ ప్రకారం చేసిన తీర్మానం చెల్లనేరదు. ఈ విషయమై 27/11/2020న గిరిజనులు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోఖో చేయడం జరిగింది, వాడగూడెం లో చేసిన తీర్మానం చెల్లదని అధికారులకు ఎంపీడీఓ, తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చి విన్నవించుకోవడం జరిగింది అయినను ఇంతవరకు అధికారులలో ఎటువంటి సమాధానం రాలేదు, ఈవిషయం  ఐటిడిఏ పీఓ దృష్టికి తీసుక రావడం జరిగింది. చట్టాలను ఉల్లఘించి తీసుకున్న నిర్ణయాలు చెల్లనేరవు కాబట్టి ఐ టి డి ఏ పీఓ సమక్షంలో మాకు న్యాయం జరుగుతుంది అని మేము నమ్ముతున్నాము అని గిరిజన యువత, నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసం బుచ్చయ్య, మడి శోభన్, మడి సతీష్, మోడెం వెంకటేశ్వర్లు, పాయం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: