మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇద్దరు లబ్ధిదారులకు రూ.87 వేల రూపాయల విలువ గల చెక్కులను బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అందజేశారు. పేదలు అనారోగ్యంతో బాధ పడుతూ ఉంటే వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నా సీఎం కేసీఆర్ గారికి విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నరసింహారావు, పిఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, టీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ముద్దంగుల కృష్ణ,తంత్రపల్లి కృష్ణ, యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,యువజన నాయకులు పద్దం శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జి సిరికొండ శ్యామ్ సుందర్, బొశెట్టి రవి ప్రసాద్,గుర్రం సృజన్,సురేందర్ పటేల్, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: