మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను బుధవారం బీహెచ్ఈఎల్ సిఎండి డాక్టర్ నలిన్ సింగల్ సందర్శించారు. బిహెచ్ఈఎల్ అధ్వర్యం లో నిర్మాణం జరుగుతున్న భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పనుల పురోగతి మరియు పనుల వేగవంతం కోసం ఆయన సమీక్ష నిర్వహించారు. మణుగూరు బిటిపిఎస్ కర్మాగారానికి చేరుకున్న ఆయనకు జెన్కో తరుపున బిటిపిఎస్ సిఈ బాలరాజు సిబ్బంది సాదర స్వాగతం పలికారు.ప్లాంట్ మొత్తం పరిశీలించిన సిఎండి డాక్టర్ నలిన్ సింగల్ మిగిలిన రెండు యూనిట్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలని సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిటిపిఎస్ సిఈ బాలరాజు,జెన్కో మరియు బిహెచ్ఈఎల్ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: