మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు భారత పార్లమెంటు లో బీజేపీ ప్రభుత్వం,ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లకు లకు అనుకూలంగా ప్రవేశపెట్టిన రైతు బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.8వ తేదీ మంగళవారం న తలపెట్టిన భారత బంద్ కు టిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతును ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అందరూ ప్రత్యేకంగా బంద్ లో పాల్గొనాలి అని వారు పిలుపునిచ్చారు.ప్రజలు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొని భారత బంద్ ను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: