కృష్ణా జిల్లా - జగ్గయ్యపేట, డిసెంబరు 6 - (మరో ఉదయం ప్రతినిధి) :-
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామం లో బీజేపీ మరియు జనసేన పార్టీ ల ఆధ్వర్యంలో డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం ముందు సంయుక్తంగా స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల ఇన్ ఛార్జ్ కల్లూరి శ్రీవాణి మరియు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ భారత జాతి కీర్తిని నలుదిక్కుల వ్యాపింపజేసిన మహనీయుడు భారత జాతికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన గొప్ప మహానుబావుడు డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను జనసేన మరియు బీజేపీ పార్టీ లు సంయుక్తంగా ముందుకుతీసుకెళ్తాయని, అంబేద్కర్ గారి అడుగుజాడల్లో వెళ్తూ ఆయన ఆశయ సాధనకై సంయుక్తం గా కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో బీజేపీ పార్టీ మండల నాయకులు రామాచారి,గోపాలరావు, అప్పారావు, శైలజ, కృష్ణకుమారి,కేబిన్ చారి, బ్రహ్మమ్, గోపాల్ మరియు జనసేన పార్టీ మండల నాయకులు తునికిపాటి శివ, గోపి చారి, నవీన్ మరియు మండల జనసైనికులు పాల్గొన్నారు.
Post A Comment: