మన్యం టీవీ మంగపేట.
భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య ని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి మర్యాద పూర్వకంగా MLA పొదెం స్వగ్రామమైనమంగపేట మండలం లోని తొండ్యాల లక్ష్మి పురం గ్రామంలో కలిసి పూల బొకేను అందచేశారు. తాను మిర్చి CTFC డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్బంగా MLA వీరయ్య ని మర్యాద పూర్వకంగా కలిసినట్లు సాంబశివరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా MLA పొదెం వీరయ్య మాట్లాడుతూ, ములుగు జిల్లావాసి నాసిరెడ్డి సాంబశివరెడ్డిని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మిర్చి బోర్డు డైరెక్టర్ గా నియమించడం మనందరికీ ఎంతో గర్వకారణం అని అన్నారు. వెనుకబడిన భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం మండలాలలో ఎక్కువగా వాణిజ్య సరళిలో సుగంధ పంటగా మిర్చిని సాగు చేస్తున్నారని మిర్చి రైతులకు అవసరమైన పథకాలను కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రాంత రైతుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. మిర్చి మార్కెట్ వసతులు, కోల్డ్ స్టోరేజ్ లు, మంజూరు చెయ్యాలని కోరారు. మిర్చి డైరెక్టర్ సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఎర్ర బంగారంగా పిలవబడే మిర్చి రైతులకు వెలుగులు తీసుక వచ్చేందుకు నా శాయశక్తుల కృషి చేస్తానని చేస్తానని అన్నారు.
Post A Comment: