మన్యం టీవి,పినపాక:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బయ్యారం- చింతల బయ్యారం మధ్యగల వాగు కోతకు గురికావడంతో, వాగు అవతల ఒడ్డున గల దాదాపు 2వేల ఎకరాల పంట పొలాలకు వెళ్లే మార్గం కొట్టుకొని పోయింది. ఈ విషయమై సుమారు 500 మంది రైతులు ఏడుల్లా బయ్యరం పంచాయతీ సర్పంచ్ కోరం రజిని దృష్టికి తీసుకవేళ్లడం తో, తక్షణమే స్పందించిన సమస్యను పరిష్కరించి రైతులకు రహదారి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ,కూలీలు సర్పంచ్ కోరం రజిని, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, పంచాయతీ వార్డు నెంబర్ ముల్లంగి వెంకటరెడ్డి లకుప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Navigation
Post A Comment: