మన్యం టీవీ : జూలూరుపాడు, మండల పరిధిలోని గుండ్లరేవు గ్రామానికి చెందిన అప్పారావు, (37) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. రెండెకరాల్లో పత్తి సాగు చేయగా.. ఈ ఏడాది భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతింది. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేయగా, దిగుబడి లేకపోవడంతో మనస్తాపం చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం బంధువులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Navigation
Post A Comment: