మన్యం టీవీ, బూర్గంపాడు:
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని,రాష్ట్ర ఖాజాను అప్పుల పాలు చేశారు అని, గిరిజన యూనివర్సిటీ ఏజెన్సీ ప్రాంతంలో లేక విద్యలో ఏజెన్సీ వాసులు తీవ్రంగా నష్టపోతున్నారని, పొడు భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని తప్పుడు కేసులు ఆదివాసీల పై పెడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అలెం కోటి,తాటి లక్ష్మన్, శ్రీను,గోగ్గేల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: