మన్యంటీవీ, అన్నపురెడ్డిపల్లి (నవంబర్ 21): అన్నపురెడ్డిపల్లి మండలంలోని తొట్టిపంపు(అన్నదైవం)గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ లో భూమిని కోల్పోతున్న రైతులతో, తహసీల్దార్ ఎంఏ.రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ సమావేశం నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 90 మంది రైతులు, మొత్తం149.22 ఎకరముల భూమిని కోల్పోతున్నారని, (సీతారామ ప్రాజెక్టు)డిప్యూటీ తహసిల్దార్ సునీల్ రెడ్డి పేర్కొన్నారు.(సీతారామ ప్రాజెక్టు) సీనియర్ అసిస్టెంట్లు గుండి.రాజులు,వర్సా. లక్ష్మణ్ రైతుల పేర్లును వారు కోల్పోతున్న భూమి విస్తీర్ణంను చదివి వినిపించగా,ప్రభుత్వం నష్టపరిహారంగా రైతులకు ఎకరానికి ఎనిమిది లక్షలు చొప్పున ఇస్తుందని తెలియజేశారు. ప్రకటించిన పేర్లలో ఎవరైనా రైతులు చనిపోతే వారి స్థానంలో కుటుంబీకుల పేరు నమోదు చేయుటకు దరఖాస్తులు సమర్పించాలని మరియు నమోదు కాని అటువంటి పేర్లు ఏమైనా ఉంటే దరఖాస్తు రూపంలో తెలియపరచాలని, మరే ఇతర అభ్యంతరాలు ఉన్న దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. సిపిఐ మండల కార్యదర్శి వూకే.నారాయణ, సీతారామ ప్రాజెక్ట్ అధికారులకు,15 మంది గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న సుమారు 30 ఎకరములు పోడు భూమి సీతారామ ప్రాజెక్ట్ కాలువలో పోతుందని,అట్టి భూములను సర్వే చేయలేదని,అవి ములకలపల్లి అటవీ రేంజ్ పరిధిలోని ఉన్నాయని, గతంలో ఈ విషయమును జిల్లా అధికారులకు విన్నవించుకున్నామని,ఆ భూములను సర్వే చేయించి భూములు కోల్పోతున్న గిరిజనులకు నష్ట పరిహారం వచ్చేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సున్నం.చిరంజీవి,డిప్యూటీ తహసిల్దార్ సునీల్ రెడ్డి, తహసిల్దార్ ఎంఏ.రాజు, సీనియర్ అసిస్టెంట్స్ గుండి.రాజులు,వర్సా.లక్ష్మణ్, పంచాయతీ సెక్రెటరీ ఎల్. ప్రశాంత్,విఆర్ఓ పూనెం. శ్రీరాములు,రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: