CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చింతూరు ఘాట్ రోడ్డు లో లారీ బోల్తా.... చర్ల కు చెందిన క్లీనర్ సజీవదహనం..

Share it:



 మన్యం టీవీ చర్ల : తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో చర్ల కు సంబంధించిన ఓ లారీ బోల్తా పడిన ప్రమాదంలో క్లీనర్ సజీవదహనం కాగా కొన ఊపిరితో బయటపడిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.శనివారం రాత్రి చింతూరు మండలం తులసి పాక కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చర్ల నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కి ధాన్యం లోడుతో వెళ్లి ధాన్యం దించేసిన తరువాత డ్రైవరు, క్లీనరు ఖాళీ లారీ తో బయలుదేరారు. ఘాట్ లోని చైనా వాల్ మలుపులో వాహనం అదుపు తప్పి పైనుంచి కింద రహదారిపై పడిపోయింది. దీనితో లారీ డీజిల్ ట్యాంకు పగిలి పోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించి వాహనం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వాహనం నుంచి బయటకు వచ్చినా డ్రైవరు ను 108 వాహనంలో చిత్తూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Share it:

TELANGANA

Post A Comment: