మన్యం టీవీ : జూలూరుపాడు,
మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామపంచాయతీకి సంబంధించిన "డంపింగ్ యార్డ్ "నిర్మాణం కోసం జూలూరుపాడు రెవిన్యూ పరిధిలో దళితులు సాగు చేసుకుంటున్న భూమిలో నిర్మాణం చేపట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని. గతంలో దళితులకు తెలియకుండానే వారు సాగుచేసుకుంటున్న భూమిలో "రైతు వేదిక" భవన నిర్మాణం జరిగిందని. ఎన్నో సంవత్సరాలుగా దళితులు సాగుచేసుకుంటున్న భూములలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం ఏంటని ? ఎమ్మార్పీఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మోదుగు రామకృష్ణ అన్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను నిలిపివేయాలని. మండల తహశీల్దార్ పిఎల్ఎన్ ప్రసాద్, కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. నిర్మాణ పనులను ఆపకపోతే తెలంగాణ ఎమ్మార్పీఎస్ సంఘం తరఫున ఉద్యమాలు చేపడతామని. రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మంద సురేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి పోతురాజు నాగరాజు, జిల్లా నాయకులు మోదుగు మణికుమార్ మాదిగ ,పాల్గొన్నారు.
Post A Comment: