వెంకటాపురం(నూగూరు)
వెంకటాపురం మండలం కేంద్రం లో ఎటిఎ ఉపాధ్యాయ సంఘాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎటిఎ రాష్ట ప్రధాన కార్యదర్శి బొదెబొయిన పరమేశ్వరవు జెండా అవిస్కరణ చేయ్యడం జరిగింది.ఈ రోజు కార్యక్రమం లో తను మాట్లాడుతూ ఆదీవాసి చట్టాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న ఉద్యమస్ఫూర్తి తో కలిసి ముందుకు సాగుతూన్న క్రమం లో మీరు భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు.ఆదీవాసి సంస్కృతి సంప్రదాయాలు తప్పనిసరిగా పాటించాలి.జీఓ యం యస్ నెంబర్.3 పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న ఉద్యమస్ఫూర్తి తో కలిసి ముందుకు నడవండి.చట్టం చెయ్యాలి అని గూడెంలో చైతన్యం చేయాలని డిమాండ్ చేశారు.నూతన రెవెన్యూ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదీవాసి ప్రజలకూ చైతన్యాన్ని నింపాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎటిఎ ఉపాధ్యాయ నాయకులు పసుల సూర్యనారాయణ,తోలెం చిరంజీవి,ఎటిఎ మండల నాయకులు సిద్ధిబొయిన భుజంగరావు ఎటిఎ నాయకులు,ఎయస్పి ములుగు జిల్లా ఉపా అధ్యక్షులు పర్షిక సతీష్,ప్రధాన కార్యదర్శి రేగా గణేష్ మరియు మండల నాయకులు చేరుకుల సర్వేశ్ ,పునేం ప్రతాప్, తూర్స చంటి ,కంతి రాజారావు తది తరులు పాల్గొన్నారు.
Post A Comment: