CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డిజిటల్ తరగతులను కచ్చితంగా నిర్వహించాలి : జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ

Share it:


మన్యం టీవి,పినపాక :  ప్రభుత్వ పాఠశాల లలో  డిజిటల్ తరగతులను ఖచ్చితంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. బుధవారం జిల్లాలో మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను పరిశీలించారు. విద్యార్థులను ఖచ్చితంగా దత్తత తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు, ఉపాధ్యాయుల టీచింగ్ డైరీలను పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుడు టీచింగ్ డైరీ తప్పకుండా రాయాలన్నారు. విద్యార్థులు డిజిటల్ తరగతులను వీక్షించే విధంగా 50శాతం ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరయ్యే విధంగా మండల విద్యాధికారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ తరగతుల పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ బయ్యారం పాఠశాలలో స్థల వివరాలను హెడ్మాస్టర్ మువ్వ వెంకటేశ్వరరావు ను  అడిగి తెలుసుకున్నారు. పాఠశాల కి సంబంధించిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు ఎస్ మాధవ్ రావు, పినపాక తాసిల్దార్ మహేశ్వర రావు, ఎం ఈ ఓ వీరస్వామి, మణుగూరు జిల్లా పరిషత్ పాఠశాలప్రధానోపాధ్యాయులు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: