మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపడు మండల కేంద్రం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఐటిసీ మిషన్ సునేరకల్ ఆధ్వర్యంలో తడి చెత్త,పొడి చెత్తపై అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమనికి భద్రాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ అనుదీప్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో ప్రతి ఇంటికి తిరుగుతూ తడి చెత్తని,పొడి చెత్తని సేకరించి,వేరు చేసి పారుశుధ్యం రహితంగా మార్చాలని ఆయా పంచాయతీ సర్పంచ్, సెక్రటరీలను కోరారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఐటిసి హెచ్ ఆర్ జి ఎం ప్రబోధ్ కుమార్ పాత్ర, ఎంపీడీఓ శంకర్ గారు, ఏపీఓ శ్రీలక్ష్మీ , మండల సర్పంచులు, సెక్రటరీలు,మల్టి పర్పస్ వర్కర్స్, ఐటిసి మిషన్ సునేరకల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: