CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఒక బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది వస్తారా?: కేసీఆర్

Share it:



హైదరాబాద్‌కు వరదల్లా కేంద్రమంత్రులు వస్తున్నారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఒక బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది వస్తారా?, దేశం కోసం, ప్రజల మంచి కోసం మాట్లాడటం తప్పా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘ఈ దేశం గతి మార్చాలి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ద్వారానే సందేశమివ్వాలి. 30 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?. బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలను, బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఎందుకు అమ్ముతున్నారు?. యూపీలోనే సక్కగ లేదు, ఆ రాష్ట్ర సీఎం వచ్చి మనకు చెప్తాడా?. 28వ ర్యాంకర్‌ వచ్చి 5వ ర్యాంకర్‌కు చెబుతాడా?. బీపాస్‌ కావాలా?.. కర్ఫ్యూ పాస్‌ కావాలో ఆలోచించండి. హైదరాబాద్‌కు పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. వంచకులు, మోసగాళ్ల జిమ్మిక్కులకు మోసపోవద్దు. రెచ్చగొట్టే మాటలు నమ్మి ఆగం కావొద్దు. భూముల విలువలు, వ్యాపారాలు పోతాయి జాగ్రత్త. గతం కంటే ఐదారు సీట్లు ఎక్కువ గెలిపించాలి. కేంద్రం మెడలు వంచి డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తాం’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: