మన్యం టీవీ ఏటూరునాగారం:
బడుగు, బలహీన వర్గాల అశాజ్యోతి మహాత్మా జ్యోతిరావుపూలే 130 వర్ధంతిని పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మెరుగు సంతోష్ గారి ఆధ్వర్యంలో జ్యోతిరావుఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు అండగా ఉండి పోరాడి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిఅని అన్నారు. ఒక బ్రాహ్మణ మిత్రుని వివాహానికి వెళ్లి అత్యంత అవమానానికి గురై అనాటి నుండి దళితుల అభ్యున్నతికి పోరాడిన వ్యక్తి మహాత్మాజ్యోతిరావు ఫూలే అని అన్నారు. ఆయన ఆశనయసాధనకోసం ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు యం ఏ సలీమ్,ఐలయ్య ,శివ శంకర్ ,బోనాల కోటి,ధర్మారావు సారయ్య,కోటి రెడ్డి సాయిలు వేణు,శ్రీను తదతరులు పాల్గొన్నారు.
Post A Comment: