అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విఫలం- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా
మన్యం టీవీ, ములకలపల్లి : మండల కేంద్రము లో జరిగిన సీపీఐ అశ్వారావుపేట నియోజకవర్గ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అతిధి గా పాల్గొని ప్రసంగించారు.ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ" అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు, రైతులు ఏ పంటలు సాగు చేయాలో ముఖ్యమంత్రి కె సి ఆర్ పాలనలో రైతులు మొక్కజొన్న వరి పత్తి పంట వేసుకోవద్దని చెప్పడం, పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. ఆరుగాలం కష్ట పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వటం లేదని అన్నారు,తడిచిన ధాన్యం. మొక్కజొన్న. వేరుశనగ. పత్తి పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు,కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లు ను రద్దు చేయలని,పోడు భూములు లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెలసీ ఎన్నికలు లో వామపక్షాలు కూటమిగా వస్తున్న జయ సారధి కి ఓట్లు వేయాలని విజప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్,జిల్లా నాయకులు వై భాస్కర్ రావు, జి రామనాధం, చిట్టిబాబు, కేశవులు, రామకృష్ణ, నారాయణ, శివకృష్ణ, శ్రీను,నరాటి రమేష్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: