మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు కుట్ర
*నగర ప్రజలు డయల్ 100 కి సమాచారం ఇవ్వండి
*హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
మన్యం టీవి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. ప్రశాంత విశ్వనగరం హైదరాబాద్ లూ విద్వేశాలు రెచ్చగొట్టి నగరానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గత ఏడేండ్లలో హైదరాబాద్ నగరానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. బోయింగ్, యాపిల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ప్రశాంతత కు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యహరిస్తామని,నగరంలో ఈ లాంటి వాటికి చోటులేదని చెప్పారు. కొందరు ఫేస్బుక్,వాట్సాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్వేష పూరితమైన ప్రచారానికి పాల్పడితే దానికి సంబంధించి ప్రజలు డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.
Post A Comment: