వెంకటాపురం (నూగూరు)
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని ఎంపీపీ ఎస్ కమ్మరి గూడెం లో SGT ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నటువంటి నడింపల్లి నాగమణి తన తల్లి నడింపల్లి శ్యామల దేవి W/O సత్యనారాయణ ప్రధమ వర్ధంతి సందర్భంగా. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ పరిధిలో నిర్వహించబడుతున్న గ్రేస్ హోమ్ అనాధ ఆశ్రమంను తన భర్త పొన్నాడ వెంకట రామకృష్ణ మరియు కుమార్తెలు హరి శ్రీ ప్రియ హాసిని ప్రియ లతో కలసి సందర్శించడం జరిగింది. అక్కడ వృద్ధులను పలకరించి వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం తమ వెంట తీసుకు వచ్చినటువంటి పండ్లను కూడా అందజేశారు. అనంతరం ఆశ్రమ నిర్వహణ కొరకు కొంత ఆర్థిక సహాయం కూడా అందజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి గ్రేస్ హోమ్ నిర్వాహకురాలు కారం రాధా మాట్లాడుతూ మీలాంటి పెద్దల సహాయసహకారాలు ఆదరాభిమానాలు మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ.ధన్యవాదాలు అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ బెజ్జంకి నారాయణ గ్రామీణ వైద్యులు రామినేని రాజేంద్ర ప్రసాద్, పాస్టర్ సోలోమన్ రాజు,బొగ్గుల పుష్ప, కారం రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: